కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు

WhatsApp Image 2024-07-27 at 15.13.12_2e25e782

 27 జూలై 2024 విశ్వంభర : - మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామానికి చేందిన టి. నర్సయ్య గారి కుమారుడు టి. నవదీప్ గారు అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా వెంటనే మన ప్రియతమా నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారికి విషయం చెప్పడంతో షబ్బీర్ అలీ గారు వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి నవదీప్ గారికి ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం 75000/-రూపాయల ఎల్.ఓ.సి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారికి నవదీప్ గారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు