వరద బాధితులకు పునరావస కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి

 గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు పాలు గుడ్లు పంపిణీ చేయాలి
 
 ప్రతి కేంద్రం వద్ద హెల్త్ క్యాంప్ నిర్వహణ చేయాలి.
 
 *వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా బిఆర్ఎస్ కార్యకర్తలు వరద సహాయ చర్యలో పాల్గొని వరద బాధితులకు అండగా ఉందాం
 
ఆకోజు సునీల్ కుమార్..

 

WhatsApp Image 2024-07-27 at 13.04.39_dba1f0c6విశ్వాంబర  జూలై 27 : -భద్రాచలం... గోదావరికి వరద పెరుగుతున్న సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేస్తున్న గోదావరి వరద బాధితుల కేంద్రాలను బాధితులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు పాలు గుడ్లు, పోషకాహారం అందించాలని వరదల వల్ల నష్టపోతున్న రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని బిఆర్ఎస్ మండల నాయకులు ఆకోజు సునిల్ కుమార్ అన్నారు..
భద్రాచలం పట్టణంలో వరద ప్రభావిత కాలనీలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వరద సహాయ చర్యలో పాల్గొని బాధితులకు అండగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు..
గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వరద బాధితులకు 10000 రూపాయలు నష్టపరిహారం పెంచి నేడు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు..
ఈ కార్యక్రమంలో ఐనాల రామకృష్ణ,దానియేలు ప్రదీప్,లక్ష్మణ్,బడిశా నాగరాజు, చిట్టిమల్ల అనిల్,జల్లి రామకృష్ణ,తెల్లం రాణి,యాదామని తదితరులు ఉన్నారు.