సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు సీఎం కు  ఎమ్మెల్యే కోమటిరెడ్డి వినతి పత్రం అందజేత 

WhatsApp Image 2024-07-27 at 11.20.01 హైద్రాబాద్ , విశ్వంభర :- జూబ్లీహిల్స్ లోని  ముఖ్యమంత్రి నివాసంలో  రాజగోపాల్ రెడ్డి , భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి  తో కలిసి ముఖ్యమంత్రికి  వినతి పత్రం అందజేశారు చౌటుప్పల్  బార్ అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా చౌటుప్పల్ సీనియర్  సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కావడానికి ప్రభుత్వ నియమాలు, మార్గదర్శకాలు అనుకూలంగా ఉన్నాయని , అన్ని శాఖల డివిజన్ కార్యాలయాలతో పాటు, రెవిన్యూ డివిజన్, మున్సిపాలిటీగా ఉన్న  చౌటుప్పల్  లో సీనియర్ సివిల్ జడ్జి  కోర్టు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని  ముఖ్యమంత్రికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరించారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా కేంద్రాన్ని మినహాయిస్తే  ఏకైక రెవిన్యూ డివిజన్ గా చౌటుప్పల్ ప్రాంతం ఉన్నదని, అన్ని కోర్టులు ఏర్పాటు చేసుకునే విధంగా ఇప్పటికే ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని  మంజూరు చేసి జ్యుడీషరీ పొజిషన్లో ఉన్నదని  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి గుర్తు చేసారు ఎమ్మెల్యే . వీటితోపాటు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకి కావలసిన పెండింగ్ కేసులకు సంబంధించి చౌటుప్పల్ ప్రాంతంలోని ఎక్కువగా ఉన్నాయని  తెలిపారు . సీఎం వెంటనే స్పందించి  లా సెక్రెటరీ కి ఫోన్ చేసి  పరిశీలించమని ఆదేశించారని  తెలిపారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు  ఊడుగు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు తాడూరు పరమేష్, జనరల్ సెక్రెటరీ రాపోలు శ్రీను, కోశాధికారి పడమటి జైపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మాజీ ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి, మాజీ జెడ్పిటిసి  చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పబ్బు రాజు  లతోపాటు  చౌటుప్పల్ బార్ అసోసియేషన్ చెందిన  40 మంది అడ్వకేట్లు  ఉన్నారు...