కాలనీ సమస్యలపై కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు  సమీక్ష -

కాలనీ సమస్యలపై కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు  సమీక్ష -

హైదర్ నగర్ అభివృద్ధి పనులపై అధికారులతో సమావేశం 

WhatsApp Image 2024-08-13 at 12.40.16విశ్వంభర,హైదర్ నగర్ :  డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ ఫేజ్ - 1 లో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి , చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి అధికారులతో, కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు  సమీక్ష సమావేశం  నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు  మాట్లాడుతూ హైదర్ నగర్ డివిజన్ సంతులిత, సమగ్ర అభివృద్దే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, దశల వారిగా అభివృద్ధి పనులు చేపడుతామని, అసంపూర్తి గా మిగిలిపోయిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకోని కాలనీ లలో స్వయంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల నుండి సమస్యలను తెలుసుకొని సత్వర పరిష్కారమే  ధ్యేయంగా పనిచేస్తామని వెల్లడించారు. ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల ను కూడా పరిగణలోకి తీసుకొని త్వరితగతిన సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేశారు. అదేవిధంగా ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి కానీ కార్పొరేటర్ కార్యాలయం దృష్టికి కానీ తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీఈ రమేష్, ఏఈ రాజీవ్, మేనేజర్ ప్రశాంతి, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, SRP సత్యనారాయణ, హార్టికల్చర్ దాసు, డ్రైనేజి సూపర్వైజర్ ఓం ప్రకాష్, ఎలక్ట్రికల్ లైన్ మెన్ వెంకటేష్, SFA రమణ, ఎంటమాలజి మురళి కాలనీ వాసులు శ్రీనివాస దాసు, సైదేశ్వర్ రావు, రామలింగేశ్వర రావు, విలియమ్స్, ఆంజనేయులు, ప్రసాద రావు, శ్రీనివాస్, చంద్ర మౌళి, ప్రసాద్, మహిళలు కృష్ణ కుమారి, జ్యోతి, ఉమా రాణి మరియు నాయకులు కుమార స్వామి, నిరంజన్ గౌడ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

 

Read More పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు మహిళా కాంగ్రెస్ పిర్యాదు

Tags: