సీఎంఆర్ ఐటి కళాశాల ఆధ్వర్యంలో విజ్ఞాన విహారయాత్ర

సీఎంఆర్ ఐటి కళాశాల ఆధ్వర్యంలో విజ్ఞాన విహారయాత్ర

విశ్వంభర, ములుగు :  మండలంలోని  నాగిరెడ్డి పల్లి గ్రామ వ్యవసాయ పంట పొలాలలో శుక్రవారం సిఎంఆర్ ఐటి కళాశాల జేఎన్టీయూ హైదరాబాద్ శాఖ వారి ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులు విజ్ఞాన విహారయాత్ర నిర్వహించారు.  ఈ సందర్భంగా నాగిరెడ్డిపల్లి గ్రామ వ్యవసాయ దారులతో మమేకమై ఆటపాటలతో సందడి చేశారు.  అనంతరం సీఎంఆర్ కళాశాల వారి సౌజన్యంతో వ్యవసాయదారులకు చల్లని మజ్జిగ, పండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, సీఎంఆర్ ఐటి కళాశాల ఆధ్వర్యంలో చదువుతోపాటు విజ్ఞానం సామాజిక సేవ లక్ష్యంగా విజ్ఞాన విహారయాత్ర నిర్వహిస్తూ, మారుమూల గ్రామాల్లోని రైతులతో, రైతు కూలీలతో ఒక రోజు గడపడం చాలా సంతోషంగా ఉందని ఈ నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు మాపట్ల చూపించిన ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో సిఎంఆర్ఐటి కళాశాల డైరెక్టర్ జంగారెడ్డి, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ విజయ, విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: