అంబలి పంపిణీ చేసిన సంఘసేవకుడు యాదగిరి గుప్త, నాగభూషణం.
On

విశ్వంభర, హైదరాబాదు: వివేకానంద కేంద్ర కన్యాకుమారి శృంగేరి శారదా పీఠం సంస్థానం గాయత్రి వాకర్స్ క్లబ్ వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 301 సంస్థల ఆధ్వర్యంలో నల్లకుంట శంకరమఠం ఆలయం వద్ద వేసవి కాలం సందర్భంగా చలివేంద్రం అంబలి అల్పాహారం కార్యక్రమం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అంబలి అల్పాహారం పంపిణీ చేసిన అతిధులు సంఘ సేవకుడు యాదగిరి గుప్త, మాజీ వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు నాగభూషణం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించడం గొప్ప విషయం అని ఇలాంటి కార్యక్రమాలను మరికొంతమంది ఆదర్శంగా తీసుకొని మరికొన్నిచోట్ల ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 301 గవర్నర్ లింగా ప్రకాష్ గుప్త, రామలింగేశ్వరరావు కృష్ణ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.