మామతో కలిసి భర్తనే చంపేసిన భార్య

మామతో కలిసి భర్తనే చంపేసిన భార్య

 

 

కట్టుకున్న భర్తలనే ఈ నడుమ కొందరు కసాయి భార్యలు కడతేరుస్తున్నారు. ఇప్పుడు కూడా కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘోరమే వెలుగు చూసింది. జిల్లాలోని బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌లో రాములు అనే వ్యక్తికి మంజులతో పెళ్లి అయింది. అయితే ఏమైందో తెలియదు గానీ.. రాములు తండ్రి నారాయణతో కలిసి భార్య మంజుల అతన్ని చంపేసింది. 

కట్టుకున్న భర్తను మంజుల, నారాయణ నరికి మరీ చంపేశారు. ఆ తర్వాత ఇంటి పక్కనే ఉన్న పాడుబడ్డ ఇంటిలోని నీటిట్యాంకులో పడేశారు. దుర్వాసన వస్తోందని ఆ ఇంటి ముందే గొయ్యి తీసి పాతిపెట్టారు. ఏమీ ఎరగనట్టు పోలీసులకు తన భర్త కనిపించట్లేదని ఫిర్యాదు చేసింది. 

కాగా ఆ శవం దుర్వాసన రావడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు భార్యనే నిందితురాలిగా తేల్చారు. కుళ్లిన స్థితిలో రాములు మృతదేహాన్ని బయలకు తీశారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపుతోంది. ఇక మంజుల, రానాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Related Posts