అమ్మాయి కోసం స్నేహితుడిని చంపేసిన విద్యార్థులు

అమ్మాయి కోసం స్నేహితుడిని చంపేసిన విద్యార్థులు

 

అమ్మాయి ప్రేమ కోసం ఏకంగా స్నేహితుడిని చంపేశారు కొందరు స్నేహితులు. ఈ ఘటన హైదరాబాద్ లోని యూసుఫ్‌ గూడలో చోటు చేసుకుంది. కూకట్ పల్లికి చెందిన అహ్మద్, అన్వరీ బేగం కుమారుడు డానీష్ (17) యూసుఫ్‌గూడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు.

కాగా ఇదే కాలేజీలో ఓ రౌడీ షీటర్ కుమారుడు కూడా చదువుకుంటున్నాడు. అతనితో పాటు మరికొందరితో డానిష్‌ కు స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే సదరు రౌడీ షీటర్ కొడుకు ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే అదే అమ్మాయితే డానిష్ స్నేహంగా ఉంటున్నాడు. దాన్ని జీర్ణించుకోలేక రౌడీ షీటర్ కొడుకు పలుమార్లు గొడవ పెట్టుకున్నాడు. 

ఇలా లాభం లేదని డానిష్ ను చంపేందుకు తన స్నేహితులతో కలిసి కుట్ర చేశాడు. పథకం ప్రకారం ఫోన్ చేసి రమ్మన్నాడు. తర్వాత అందరూ కలిసి గంజాయి తాగారు. అంనతరం ఖాళీ బీరు సీసాలతో డానిష్ ను కొట్టి చంపేశారు. రైల్వే పట్టాలపై డెడ్ బాడీని పడేశారు. డానిష్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితులని అదుపులోకి తీసుకున్నారు.

Related Posts