ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బీమా అవసరం
On

విశ్వంభర,ఆమనగల్లు: ప్రతి ఒక్కరూ పోస్టల్ భీమా సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి పోస్టల్ సూపరిడెంట్ ఎం. భూమన్న అన్నారు. ఆమనగల్లు బస్టాండ్ ఆవరణలో శుక్రవారం శుక్రవారం పోస్ట్ ఆఫీస్ కు సంబంధించిన ప్రమాద భీమాలు రూ 345.. 5 లక్షలు, రూ 565 కు 10 లక్షలు, రూ 755 15 లక్షల వ్యక్తిగత ప్రమాద భీమా క్యాంపును ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ మేనేజర్లు రాజశేఖర్, మీర్జ మౌజమ్, పోస్ట్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.