పోలీసులపై దాడి.. మియాపూర్‌లో 144 సెక్షన్ అమలు

పోలీసులపై దాడి.. మియాపూర్‌లో 144 సెక్షన్ అమలు

మియాపూర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నేటి నుంచి 29వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.

మియాపూర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నేటి నుంచి 29వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. 144 సెక్షన్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ అవినాష్ మహంతి హెచ్చరించారు. మియాపూర్ హెచ్ఎండీఏ వివాదాస్పద ల్యాండ్‌లో పోలీసులు డ్రోన్‌తో గస్తీ కాస్తున్నారు. కాగా, మియాపూర్ ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు.
 
సంగీత, సీత అనే మహిళ ఇతర మహిళలను ఉసిగొల్పి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు యత్నించి స్థానిక ఫంక్షన్ హాల్స్‌లో మీటింగ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. కాగా, మొత్తం పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంగీత, సీత, సంతోష్‌తో పాటు మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.