టీమిండియాపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ

టీమిండియాపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ

 

Read More ఘనంగా ముగిసిన హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2024

 

Read More ఘనంగా ముగిసిన హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2024

టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా దుమ్ము లేపింది. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఇండియా గెలిచింది. అయితే ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ వీడియోను విడుదల చేశారు. 

ఇందులో ఆయన మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌ చారిత్రాత్మకమైనదని, టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు తమదైన స్టైల్లో ఇంటికి తీసుకొచ్చిందంటూ ప్రశంసలు కురిపించారు. ఇంతటి ఘన విజయం సాధించిన ఇండియా టీమ్ కు దేశ ప్రజలందరి తరఫున అభినందనలు తెలిపారు. 

ఈ రోజు 140 కోట్ల మంది దేశప్రజలు మీ అద్భుతమైన ఆటతీరుకు గర్వపడుతున్నారు. ఈ విజయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా విజయాలు సాధించిన మీకు అభినందనలు అంటూ ఆయన ప్రశంసలు కురిపించారు. ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

 

Read More ఘనంగా ముగిసిన హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2024

Related Posts