ఘనంగా మహావీరు జయంతి కార్యక్రమం

విశ్వంభర, హనుమకొండ జిల్లా: హనుమకొండ మండలం భీమారం గ్రామంలో నీ ఓ అపార్ట్మెంట్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ ఎంపవర్మెంట్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు చైర్మన్ మహమ్మద్ మొయినుద్దీన్ ఆదేశాల మేరకు మహావీరు యొక్క జయంతి కార్యక్రమం హనుమకొండ జిల్లా అధ్యక్షులు విన్నకోట గోవర్ధన్ ఆధ్వర్యంలో మహావీరు యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ మాట్లాడుతూ మహా వీరు అనే వ్యక్తి క్రీస్తు పూర్వం 599 వ సంవత్సరంలో జన్మించారని, అంతేకాకుండా భారతదేశంలో బీహార్ రాష్ట్రం లోని వైశాలి జిల్లాలోని కుందాల్పూర్ అనే గ్రామంలో జన్మించారు, అని గుర్తు చేశారు. ఈయన ఒక రాజ కుటుంబం లో జన్మించారని, ఆయన అన్నారు . మహావీరుని యొక్క చిహ్నం సింహం, ఈయన ఒక్క అహింస ధర్మం, శాంతి మొదలైన వాటిని బోధించాడు, అంతేకాకుండా ఇతని జయంతి కార్యక్రమం ప్రతి సంవత్సరం జైనులు, చైత్ర శుక్ల పక్ష త్రయోదశి నాడు జరుపుకుంటారు, ఇక్కడ ఒకే కాడ కాకుండా కేవలం ఇక్కడే కాకుండా ఈయన జయంతి కార్యక్రమం అన్ని రాష్ట్రాలలో జరుపుకోవాలని ఉద్దేశంతోటే ఎన్ హెచ్ ఆర్ సి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వారు అన్నారు . ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ చిల్డ్రన్స్ మరియు ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ సభ్యులు సరిత, తిరుపతి, మేఘరాజు, వేణు , అమరావతి ,పరమేష్, రాజేష్, లు పాల్గొన్నారు .