అందరి వాడు అంబేద్కర్ - మాల మహానాడు కేతపల్లి మండల అధ్యక్షుడు మెరుగుమళ్ళ బిక్షం 

అందరి వాడు అంబేద్కర్ - మాల మహానాడు కేతపల్లి మండల అధ్యక్షుడు మెరుగుమళ్ళ బిక్షం 

విశ్వంభర, నకిరేకల్ నియోజక వర్గం ; డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా తుంగతుర్తి గ్రామంలోని బొడ్రాయి సమీపంలో ఉన్న అంబేద్కర్  విగ్రహాం వద్ద మాల మహానాడు కేతపల్లి మండల అధ్యక్షుడు మెరుగుమళ్ళ బిక్షం నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ..బడుగు బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు పాటుపడిన మహానీయుడు అంబేద్కర్‌ అని కొనియాడారు. దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచాడని   ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమే తెలంగాణ రాష్ట్రానికి జవజీవం పోసిందని గుర్తు చేసుకున్నారు. ఆయన స్ఫూర్తితోనే ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటు పడుతుందని అన్నారు. దళితుల అభ్యున్నతిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేస్తుందనఅని అన్నారు. ఈ కార్యక్రమంలో . తుంగతుర్తి కార్యదర్శి  రాణి తుంగతుర్తి  మాజీ ఎంపీటీసీ కీర్తి వెంకన్న గౌడ్ కేతపల్లి  మాజీ ఎంపిటిసి మట్టి సాల్మన్ బొప్పని నాగరాజు కుకుట్ల బాలస్వామి అంజి  గాదరి సతీష్ ఉపేందర్  బిక్షం రాజు  గాదరి జంపన్న, బొప్పని కిషోర్ మేకల నరేష్  కోటయ్య  మోహన్ నరేష్  గని భాస్కర్ నాగయ్య జార్జి వెంకటేశం అంగన్వాడి టీచర్ పురం కలమ్మ మనమ్మ కౌసల్య నాయకులు, గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు..

Tags: