సేతుమాధవ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
On
విశ్వంభర, ఎల్బీనగర్ : ఆర్కె పురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ కి చెందిన సేతుమాధవ్ కుమారుడు శ్రీరామ్ గత నెలలో అమెరికా నుండి హైదరాబాద్ వచ్చారు. కుటుంబసభ్యులతో కలసి కేరళ సందర్శనకు వెళ్లి అక్కడ అకస్మాత్తుగా గుండెపోటు తో 5 రోజుల క్రితం చనిపోయాడు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న మహేశ్వరం నియోజక వర్గ మాజీ మంత్రి , ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ప్రధానకార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ ,నాయకులు గొడుగు శ్రీనివాస్,కొండ్ర శ్రీనివాస్,వెంకటేష్ గౌడ్ మురళీధర్ రెడ్డి,కంచర్ల శేఖర్,పెంబర్తి శ్రీనివాస్,జగన్మోహన్ రెడ్డి ,పుష్పలత రెడ్డి , ఊర్మిళ రెడ్డి ,జాహెద్,రమేష్ కురమ,వల్లూరి రమేష్ ,మహేష్ ,దయాకర్ రెడ్డి ,కాలనీ వాసులు పాల్గొన్నారు.



