27 న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి
- పటాన్ చేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ సింధు ఆదర్శ రెడ్డి
విశ్వంభర , పటాన్ చేరు: బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పటాన్ చేరు బిఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పిలుపునిచ్చారు. మాట్లాడుతూ నీళ్ళు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా 25 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిం దన్నారు.కేసీఆర్ ఆధ్వర్యంలో స్వరాష్ట్రం కోసం అలుపూ పెరుగని పోరాటాలు చేసిందన్నారు. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మెతో కేంద్రాన్ని కదిలించిందన్నారు.రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగంగా టిఆర్ఎస్, బీఆర్ఎస్గా ఆవిర్భవించిందన్నారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో అనేక విప్లవాత్మ కమైన మార్పులు తీసుకువచ్చిందని, రైతులకు,బడుగు, బలహీనవర్గాలకు, దళితులకు ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. దేశంలోనే తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా నిలిపిన ఘనత కేసీఆర్దన్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు భవిష్యత్ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, పటాన్ చేరు నియోజకవర్గ బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలనీ పటాన్ చేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పిలుపునిచ్చారు.



