డా. కోడి శ్రీనివాసులుకు అభినందనలు - MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

డా. కోడి శ్రీనివాసులుకు అభినందనలు - MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

 మహాత్మా గాంధీ శాంతి పురస్కారం-2024 ను అందుకున్న డాక్టర్ కోడి శ్రీనివాసులు

విశ్వంభర, చండూరు:  డాక్టర్ కోడి శ్రీనివాసులు గత పది సంవత్సరాలుగా సామాజిక సేవా రంగంలో ముందుంటూ, 2024 సం. గాంధీజీ ఫౌండేషన్ స్థాపించి ఫౌండేషన్ ద్వారా అనేకమంది నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకుగాను తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ వారు మంగళవారం రోజు హైదరాబాదులోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో  మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ అవార్డు- 2024ను తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్, బీసీ కమిషన్ రాష్ట్ర అధ్యక్షులు గోపిశెట్టి నిరంజన్ గార్ల చేతుల మీదుగా అందించి ఘనంగా సత్కరించారు. అవార్డు తీసుకున్న డాక్టర్ కోడి శ్రీనివాసులును మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నివాసంలో ఘనంగా సన్మానించి, తదనంతరం వారు మాట్లాడుతూ భవిష్యత్తులో గాంధీజీ ఫౌండేషన్ ద్వారా పేదలకు మరెన్నో సేవలు ముందుకు తీసుకురావాలని, దానికి తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా సమయంలో  నిత్యావసర సరుకుల పంపిణీ, హోమియో మెడిసిన్ పంపిణీ, కూతుర్లు కుమారులు లేని నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, పుట్టినరోజు సమయాలలో అనాధలకు అన్నదానం-నిత్యావసర సరుకులు పంపిణీ, వరదలు సంభవించిన సమయంలో నిధుల సేకరణ వాటి పంపిణీ మొదలగు కార్యక్రమాల గురించి తెలుసుకున్న తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిందని తెలిపారు. తనను అభినందించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు.WhatsApp Image 2024-10-23 at 15.36.31

Tags: