భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం విజయవంతం 

– కార్యనిర్వాహణ అధికారి ఎల్. రమాదేవికి కోటి వందనాలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం విజయవంతం 

విశ్వంభర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :- భద్రాద్రి కొండలపై భక్తిశ్రద్ధలతో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం ఈ ఏడాది అంగరంగ వైభవంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా విజయవంతంగా పూర్తయింది. ఈ పుణ్యకార్యాన్ని నిండు హృదయంతో, సమగ్ర సమన్వయంతో నిర్వహించిన భద్రాచలం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఎల్. రమాదేవి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకకు విచ్చేసిన భక్తులకు, వివిధ రంగాల విఐపీలకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రిమండలి సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎంతో నిపుణతతో, తనదైన ప్రత్యేక శైలిలో ఈ మహోత్సవాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. భద్రాచల ఉత్సవాల చరిత్రలో ఒక గొప్ప గుర్తింపుగా నిలిచే విధంగా ఆమె నిర్వహణ ప్రశంసనీయం. భక్తులకు అన్నదానం, తాగునీరు ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు వంటి ఏర్పాట్లు ప్రతి మూలన సరఫరా అయ్యేలా చేశారు. ఎటువంటి గందరగోళం లేకుండా, ప్రతి భక్తుడికి సేవలుపాలుగే విధంగా ఏర్పాట్లు చేశారన్నది విశేషం. భద్రాచలం కల్యాణం సందడి మరింత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరగడానికి కారణమైన ఎల్. రమాదేవి గారికి పునఃశ్చరణంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆమెకు భక్తుల తరఫున హృదయపూర్వక నమస్సులు.

Tags:  

Advertisement

LatestNews

'అమృత వర్షిణి ఆర్ట్స్ '' సినీ సంగీత స్వర సమీరాలు సీజన్ -8
భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారినీ దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత, ఎంపీ వద్దిరాజు 
తెలంగాణ టీడీపీ రాష్ట్ర నాయకులు గూడపాటి శరత్ ను కలిసిన ఏలే మహేష్ నేత 
సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షడు డా. యర్రమాద కృష్ణారెడ్డి నీ కలిసిన ఏలే మహేష్ నేత 
కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జనరల్ సెక్రెటరీ డా. కొదుమూరి దయాకర్ రావు నీ కలిసిన ఏలే మహేష్ నేత 
Sr జర్నలిస్ట్ , విశ్వంభర దినపత్రిక బ్యూరో పోతుగంటి వెంకటరమణ కు  ఆహ్వానం 
పద్మశాలి సంఘం అధ్యక్షడు పున్న గణేష్ నేత కు ఆహ్వానం