అందుకే నయనతారతో గొడవలు వచ్చాయి: త్రిష

అందుకే నయనతారతో గొడవలు వచ్చాయి: త్రిష

 

త్రిష ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో కాలం సినిమాలు చేసింది. ఇప్పుడు నయన తార మాత్రం ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటుంది. ఆమెకు, త్రిషకు ఇద్దరికీ స్టార్ డమ్ ఉంది. అయితే మధ్యలో వీరిద్దరి మధ్య చాలాగ్యాప్ వచ్చింది. ఇద్దరూ గొడవలు పడేదాకా పరిస్థితి వెళ్లిందని తమిళ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. 

Read More సినిమా నడుస్తుండగానే వర్షం.. తడిసి ముద్దయిన ప్రేక్షకులు.. వీడియో ఇదిగో!

దీనిపై త్రిష రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. నయన్ నేను చాలా కాలంగా ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. అయితే అనుకోకుండా మా ఇద్దరి నడుమ వ్యక్తిగత కారణాల వల్ల గొడవలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని విషయాల్లో ఒకరిని ఒకరం అర్థం చేసుకుని ముందుకు సాగాం. కాబట్టి మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మళ్లీ మొదలైంది. 

ఇప్పుడు ఇద్దరం ఒకరికి ఒకరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అంటూ తెలిపింది త్రిష. అయితే త్రిష మాట్లాడిన మాటల్లో వాస్తవం లేదనిపిస్తోంది. ఎందుకంటే వీరిద్దరూ ఒక్కసారి కూడా కలిసి కనిపించలేదు. ఇప్పటికీ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది.

Related Posts