కొత్తూరు మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్ మొక్కలు పంపిణీ
On
విశ్వంభర న్యూస్ కొత్తూరు : - మనిషికి ఆక్సిజన్ అందించే చెట్లను పెంచడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కొత్తూరు మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలో తొమ్మిదవ వార్డులో సీడ్ మొక్కలను కొత్తూరు మున్సిపాలిటీ గ్రీన్ బడ్జెట్ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్ మొక్కలను అందజేశారు, ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రకృతి నీ కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. మనిషి మనుగడకు చెట్లు ఎంతో కీలకమని ఆయన ప్రజలకు తెలియజేశారు. రాబోయే రోజుల్లో చెట్లు లేకుంటే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు సూపర్వైజర్ దాసరి శ్రీనివాస్, విజయ్, అంగన్వాడీ టీచర్లు ఉమాదేవి, మహిళలు సంఘం సభ్యులు మాదారం హైమావతి, స్వరూప, జాంగిర్ బి, తస్లీమ్, కాలనీవాసులు సత్యనారాయణ గౌడ్, సుదర్శన్ చారి, సంఘాలు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.
Tags: vishvambhara vishwambhara CommunityDevelopment EnvironmentalAwareness CommunityService PublicService GreenInitiative EnvironmentalInitiative Kothur Municipality 9th Ward Councilor Madaram Narasimha Gaud distribution of saplings KothurMunicipality SaplingDistribution #TreePlanting UrbanGreening