రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు - బిఎన్  రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు - బిఎన్  రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి

విశ్వంభర, ఎల్బీనగర్  నియోజకవర్గం : బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీ ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్యులు, సిబ్బందిల నిర్లక్ష్యం వల్ల రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారని బి.యన్.రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డికి  సమాచారం అందడంతో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన రోగుల పట్ల ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆసుపత్రిలో రోగులకు సరైన చికిత్స అందడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దవాఖానకు వచ్చే రోగులతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ,పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి అయిన, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా కూడా రోగులకు అందుబాటులోకి తీసుకు రావడం లేదని ఆరోపించారు.  ప్రజలకు అందుబాటులో లేని ప్రభుత్వ ఆసుపత్రి ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలియజేసారు. రోగులపట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో కృష్ణ తదితరులు పాల్గొన్నారు

 

Read More ఎంపీ వద్దిరాజుకు ఆహ్వానం

Tags: