హాస్పిటల్ లో కొరతగా ఉన్న సిబ్బందిని వెంటనే నియమించాలి 

మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్

WhatsApp Image 2024-07-26 at 16.30.25_4451b3d3 విశ్వాంబర  జూలై 26 : - దోమకొండ మండల కేంద్రంలో గల సిఎస్సి వైద్యశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయించాలని తాజా  మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ జిల్లా వైద్యాధికారి విజయలక్ష్మి, మెడికల్ కాలేజ్ సూపరిండెంట్ రామ్ సింగ్ నుకోరారు. 
శుక్రవారం రోజు కామారెడ్డి ప్రభుత్వ దావఖానలో వారిని కలిసి దోమకొండ వైద్యశాల పరిస్థితులను తెలిపారని ఆయన అన్నారు. దోమకొండ సిహెచ్సి నందు ఇదివరకు పని చేసిన గైనకాలజిస్ట్ డెంటిస్ట్ స్టాఫ్ నర్స్ ఫార్మసిస్టు ఎంఎన్ డి డ్రగ్ డ్రెస్సింగ్ కు లాంగ్ స్టాండింగ్ లో బదిలీ అయినందువల్ల ఇబ్బంది అందుబాటులో లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశాను అన్నారు. అలాగే శానిటేషన్ సిబ్బంది కొరతగా ఉన్నందున హాస్పటల్ కి వస్తున్న పేషంట్లకు ఇబ్బంది కలుగుతుందని ఆయన వివరించారు. లాంగ్ స్టాండింగ్ లో బదిలీ అయిన వైద్యులు సిబ్బంది స్థానాలలో నూతన పోస్టింగులు ఇచ్చి సిబ్బందిని వెంటనే నియమించాలని కోరినట్లు ఆయన తెలిపారు . ఈ విషయమై జిల్లా వైద్యాధికారి స్పందించి త్వరలో భర్తీ చేస్తామని తెలిపినట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దోమకొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీతారామ్ మధు తదితరులు ఉన్నారు.