జన్మదినం సందర్భంగా మైసిగండి మైసమ్మను దర్శించుకున్న సీ.ఎల్. శ్రీనివాస్ యాదవ్

WhatsApp Image 2024-07-26 at 13.23.43_ee724f49విశ్వంభర, కడ్తాల్, జులై 26 : - కడ్తాల్ మండల కేంద్రంలో  బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, తలకొండపల్లి మాజీ ఎంపిపి సీఎల్. శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు కడ్తాల్ మాజీ జడ్పిటిసీ దశరథ్ నాయక్ నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా దశరథ్ నాయక్, సింగల్ విండో చైర్మన్ వెంకటేష్ గుప్తా, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ ,మాజీ సర్పంచి లక్ష్మీ నర్సింహారెడ్డి తో కలిసి శ్రీనివాస్ యాదవ్ కేకు కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. అదే విదంగా మైసిగండి మైసమ్మ ఆలయంలో శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లాయక్ అలీ, నర్సింహా, విజయ్ రెడ్డి,వెంకటయ్య,లింగం గౌడ్,బాల కుమార్ గౌడ్,మణికంఠ,రాజేందర్,శ్రీశైలం,అంజి,నరేష్,శ్రీరాములు,సాయి,శ్రీనురాజేష్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.