ఏబీవీపీ ఆధ్వర్యంలో "రాష్ట్ర ప్రభుత్వ" దిష్టి బొమ్మ దహనం

WhatsApp Image 2024-07-26 at 17.21.16_b2bbe9afవిశ్వంభర,ఆమనగల్లు, జులై 26 : -అమనగల్లు రాజీవ్ గాంధీ చౌరస్థలో రాష్ట్రం లో పెండింగ్ ఉన్నటువంటి 7000 కోట్ల ఫీజ్ రియాంబర్స్మెంట్ ను  విడుదల చెయ్యాలని అమనగల్లు ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరటి భరత్ మాట్లాడుతూ 7000 కోట్ల ఫీజ్ రియాంబర్స్మెంట్స్ విడుదల చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు, మరియు మెగా డీఎస్సీ నీ ప్రకటించాలని అలాగే ఫీజ్ నియంత్రన చట్టాన్ని పటిష్టంగా అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లండం మల్లేష్, నాయకులు ఏడవల్లి అంజి, చిన్నంచెట్టి మల్లేష్, గండికోట విజయ్, సిద్ధు, ప్రసాద్, టాఘుర్, చరణ్ రాకేష్, కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు.....