ఆధునిక యుగ వైతాళికుడు జ్యోతీరావు పూలే: ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ.

విశ్వంభర, ఎల్బీనగర్ : ఆధునిక యుగ వైతాళికుడు, సామాజిక తత్వవేత్త, సంఘ సంస్కర్త జ్యోతీరావు పూలే అని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ అన్నారు. శుక్రవారం మహాత్మా జ్యోతీరావు గోవిందరావ్ ఫూలే జయంతి సందర్బంగా సేవలను స్మరిస్తూ తెలంగాణ భవన్ లో
మహానీయుని చిత్రపటానికి మీర్ పెట్ మాజీ డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డితో కలిసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అరవింద్ శర్మ మాట్లాడుతూ సమాజంలోని అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం , విద్య కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు అని అన్నారు . సత్యం, సమానత్వం అన్న సూత్రాల ఆధారంగా నూతన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి సత్య శోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ వీరమళ్ళ రామ్ నర్సింహా గౌడ్, న్యాల కొండ శ్రీనివాస్ రెడ్డి, శ్రీమన్నారాయణ, పెంబర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.