ప్రముఖ విద్యావేత్త డా. వెంకటేశ్వర్లకు జ్యోతిరావు పూలే స్మారక అవార్డు 2025 ప్రధానం

విశ్వంభర, బషీర్ బాగ్ : బడుగు వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేసి నేటి సమాజంలో బీసీ హక్కుల కోసం పోరాడేందుకు మనలో స్ఫూర్తిని నింపిన మహాత్మ జ్యోతిరావు పూలే అని పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి పురస్కరించుకొని బీసీ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు.భారత ప్రజల ఆశాజ్యోతి, సాంఘిక దురాచారాలను రూపుమాపిన సంస్కర్త, మహిళల విద్య హక్కులకై అహర్నిశలు శ్రమించి విద్యనందించిన విద్యాప్రదాత, అంటరానితనాన్ని అడుగడుగునా అనిచివేసిన ధైర్యశాలి, మహిళల విద్య ప్రదాత, భారత ప్రభుత్వం చే మహాత్మా అని బిరుదుతో సత్కరించబడిన జ్ఞాన జ్యోతి, భారత ప్రజల ధ్రువదాత మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు.