జై భీమ్ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా.

విశ్వంభర, నాగోల్ : అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఎల్బీ నగర్ లోని అంబేడ్కర్ విగ్రహం నుండి 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం వరకు జరుగు జై భీమ్ ర్యాలీ పోస్టర్ ను నాగోల్ లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో టీపీసీసీ ప్రచార కమిటీ కోకన్వీనర్, పర్యాటక శాఖ రాష్ట్ర మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆవిష్కరించారు. ఈ సందర్భగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీ నీ ప్రారంభించాలని కోరారు. ఈ సందర్భగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ప్రపంచ మేధావి, సామాజిక, రాజకీయ విప్లవకారుడు, మానవ హక్కుల ప్రదాత, మహోన్నత రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారత దేశ తొలి న్యాయశాఖ మంత్రి, కుల నిర్మూలన సిద్ధాంతకర్త , స్వేచ్ఛ, సమానత్వం, సమ సమాజ స్వాప్నికుడు బాబాసాహెబ్ డా.బీ.ఆర్.అంబేడ్కర్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నక్క మహేష్ మాదిగ, జేఏసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం కొటేష్ మాదిగ, జేఏసీ రాష్ట్ర నాయకులు మేడి ప్రసాద్ మాదిగ, జేఏసీ యువజన రాష్ట్ర నాయకులు కొత్తపల్లి అన్వేష్ మాదిగ, జేఏసీ యువజన రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.