కార్య ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ

విశ్వంభర ,మహబూబాబాద్ : తెలంగాణ ప్రభుత్వ అనుసంధానంతో కార్యా ప్రాజెక్ట్ సన్మతి కార్యా అనే సంస్థ ప్రాజెక్ట్ వాణి కు సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా గ్రామీణాభివ్రుద్ది శాఖ సహకారంతో జిల్లా కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించారు.
ఈ సందర్బంగా అదనపు డి.ఆర్.డి.ఓ జయశ్రీ మాట్లాడుతూ ప్రాజెక్ట్ వాణి అనేది కృత్రిమ మేధస్సును మెరుగుపరచడానికి చేస్తున్న ఒక ఆడియో కలెక్షన్ ప్రాజెక్ట్ అని దీని నిర్వహణ ఐఏఎస్ఇ బెంగళూరు వాళ్లు ప్రాజెక్ట్ వాణి చేస్తున్నారని దీనికి గూగుల్ సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యాక్రమంలో శుక్రవారం తెలంగాణ సెక్రటేరియట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎమర్జింగ్ డిపార్ట్మెంట్ నుండి కిరణ్ మరియు ఆనంద్ మరియు కార్యా నుండి ప్రతినిధి హరి ప్రకాష్ హాజరై 50 మంది కోఆర్డినేటర్లకు శిక్షణ కార్యక్రమం ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎవరైతే ఈ ప్రాజెక్ట్ ద్వారా పని చేస్తారో వాళ్ళు మొబైల్ ఫోన్ ద్వారానే పని చేస్తూ సంపాదించుకునే అవకాశం ఉంటుందని అన్నారు.