చలివేంద్రం దాహార్తిని తీరుస్తుంది - బిళ్ళకంటి కిరణ్ గుప్తా
.jpeg)
విశ్వంభర, మీర్ పెట్ : చలివేంద్రం పాదాచారుల, వాహనదారుల దాహార్తిని తీరుస్తుందని రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి బిల్లు కంటి కిరణ్ గుప్తా అన్నారు. గురువారము ఆర్యవైశ్య సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాలాపూర్ క్రాస్ రోడ్స్ లో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆయన ముఖ్య అతిదిగా హాజరై ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఉపయోగర్థం చలివేంద్రం ను ప్రారంభంమించడం జరిగింది అని అన్నారు. మీర్పేట్ ఇన్స్పెక్టర్, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు దుద్దెళ్ల రమాదేవి , అదనపు కోశాధికారి తేరెట్ పల్లి శ్రీనివాస్ గుప్త, బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నాళ్ల శ్రీనివాస్ గుప్త , దేవస్థానం ప్రధాన కార్యదర్శి ఇరువెంటి సురేష్ గుప్త, దేవస్థానం కోశాధికారి గందె వెంకటేశ్వర్లు గుప్త , మీర్పేట్ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు గందె వనజ, బాలాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి మాజేటి మురళీధర్ గుప్త, బాల జంగయ్య గుప్త , మీర్పేట్ ఆర్యవైశ్య సంఘం కోర్ కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు .