వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘం  ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు 

వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘం  ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు 

విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళా విభాగం అధ్యక్షురాలు సూర్య శ్రావణి అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో రాణిస్తూ రాజకీయాలలో కూడా అడుగులు వేస్తూ రాణించాలని మహిళలను ప్రోత్సహిస్తూ  అన్నారు కార్యక్రమంలో వివిధ రంగాలలో రాణిస్తున్న వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘం  మహిళలను సత్కరించారు. అంతే కాకుండా మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులను సైతం అందజేశారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘం  రాష్ట్ర అధ్యక్షుడు సంగమేశ్వర్ రాష్ట్ర మహిళా గౌరవ అధ్యక్షురాలు లక్ష్మీ సోమశేఖర్ మహిళా ప్రధాన కార్యదర్శి విద్యుల్ లతా మహిళా కోశాధికారి అశ్విని శంకర్ శివకుమార్ దినేష్ పాటిల్ రాచప్ప  తదితరుల పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

శ్రీ మందిరం ట్రేడర్స్ అండ్ సర్వీసెస్ కు బెస్ట్ పార్టనర్ షిప్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అవార్డు
రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బీసీలు ఉద్యమించాలి - రాజ్యసభ సభ్యులు ఆర్ . కృష్ణయ్య 
ప్రభుత్వ స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదు - రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య 
వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘం  ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు 
శ్రీ త్యాగరాయగాన సభలో పలువురు జర్నలిస్టులకు సత్కారం 
42% బిల్లులపై సీఎం రేవంత్‌కు డా. వకుళాభరణం బహిరంగ లేఖ
ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ ని కోరిన బీఆర్ఎస్ శాసనసభా పక్షం.